డాక్టర్ బి.ఆర్ ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ కాంతారావు
మన్యం మనుగడ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా కరకగూడెం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ అనే ఆయన అడుగుజాడల్లోనే ప్రతి ఒక్కరు నడవాలని అన్నారు. దేశంలోనే బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. అలాగే ఆయన అడుగుజాడల్లో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల దేశం సృష్టి రంగ పయనిస్తుందని అన్నారు. సమాజ స్థాపన కోసం మానవత్వం కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, నిట్ట.ఏడుకొండలు,చిట్టిమల్ల ప్రవీణ్, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు. స్థానిక ఉపసర్పంచ్ రావుల.రవి, ఏలుగొండ. శ్రీను టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ఎగ్గడి. శ్రీనివాస్, నాయకులు వాసిరెడ్డి నేతాజీ వెంకట్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రామలింగం,సార. సాంబయ్య, బర్లగూడెం సర్పంచ్ పోలెబోయిన నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: