మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలలో ఆయన పాల్గొని నివాలర్పించారు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అణగారిన వర్గాల కోసం తాను రచించిన భారత రాజ్యాంగం ద్వారా రక్షణ పొందేలా చూశాడన్నాడు. ఆయన లేకుండా ఉంటే భారతదేశం మరోలా ఉండేదన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దినేష్, చాపలమడుగు వెంకటేశ్వర్లు, రెడ్డిపోగు సురేష్, రామరాజు, లక్ష్మణరావు, బడుగు శంకర్, జడ్పిటిసి కొనకళ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ బానోత్ పార్వతి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఎంపిటిసి దారా వెంకటేశ్వరరావు,ఆప్పిల్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గోళ్ళ రమేష్, అఖిలపక్షం నాయకులు మాలోత్ బోజ్యానాయక్,ఉప్పతల ఏడుకొండలు,చిదేళ్ల పవన్ కుమార్, వారధి సత్యనారాయణ,వరికూటి వెంకట్రావు,ఉమర్, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: