మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని మసీదు ఆవరణంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫాలను ముస్లిం కమిటీ చేతుల మీదగా మండలంలోని ముస్లిం కుటుంబలకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ లూధర్ విల్సన్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను, కులాలను గౌరవిస్తూ రాష్ట్రమంతటా ప్రతిష్ఠాత్మకంగా వివిధ పండుగల సందర్భంగా వివిధ మతాల వారిని గౌరవిస్తూ ప్రభుత్వం కానుకలను పంపిణీ చెయ్యటం జరుపుతుందని అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదేశాల మేరకు ముస్లిం కుటుంబలకు ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫాలను పంపిణీ చెయ్యటం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జామా మజీద్ కమిటీ అధ్యక్షులు షేక్ సిద్దిఖ్, కమిటి సభ్యులు షేక్ బాబు, షేక్ బాబాజీ, షేక్ నాగుల్ మీరా, షేక్ జాని, పఠాన్ సల్మాన్ ఖాన్, రజాక్, లతీఫ్, మహబూబ్, సుభాని, జూలూరుపాడు సర్పంచ్ గుండెపిన్ని విజయ, ఎంపిటిసి పెండ్యాల రాజశేఖర్, రొకటి సురేష్ , ఎదళ్లపల్లి వీరభద్రం, లకావత్ గిరిబాబు, బేతాళపాడు సర్పంచ్ రాందాస్ నాయక్, రంగారావు రామిశెట్టి రాంబాబు, మోదుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: