గుండాల/ఆళ్ల పల్లి ఏప్రిల్ 22(మన్యం మనుగడ) కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆడపడుచుల పెళ్ళికి ఈ పథకం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు పది లక్షల మంది ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ డబ్బులను అందజేసింది అన్నారు. పేదింటి ఆడపడుచులకు ఈ పథకం గొప్ప వరంగా మారిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ఈ పథకం దేశంలో ఎక్కడ లేదని ఇలాంటి పథకాలు పెట్టి సాహసం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయటం లేదని అన్నారు. ఈ ఘనత అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెందుతుందని అన్నారు. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరు ఘనంగా చేసుకోవాలన్న దృఢ సంకల్పం తోనే ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజుభార్గవి, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, తాసిల్దార్ నదియా సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు నరసింహారావు, అధికారులు ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: