మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలంలో జిన్న గట్ట అనే గ్రామంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆరు కుటుంబాలను ఇల్లు కాలిపోయిన అటువంటి వారికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ ఎలమంచిలి సీతారామయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యాక్రమని కన్వీనర్ యలమంచి శ్రీనుబాబు ఆధ్వర్యంలో అపక రామరావు, సోందే నారాయణ, సోందే భద్రయ్య, అపక లక్ష్మయ్య, అపక రంగయ్య, కోర్సా లక్ష్మయ్య కుటుంబాలకు సుమారు 15000 విలువగల నిత్యవసర సరుకులు బట్టలు, బియ్యం, పప్పు, నూనె వంట సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో ఆరు కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తక్షణమే కాలిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్స్ వాళ్ల సొంత స్థలాలు మంజూరు చేయాలని ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వారికి వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు బట్టలు ఆర్థిక సహాయం చేయాలని ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ట్రస్ట్ కన్వీనర్ యలమంచి శ్రీనుబాబు స్థానిక సర్పంచ్ తోడం తిరుపతిరావు, స్థానిక వార్డ్ మెంబర్ అపక నాగరత్నమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, పాకలపాటి వెంకట రాజు, బైరెడ్డి సతీష్, ఎస్.కె అహ్మద్ హుస్సేన్, దల్లి సతీష్, తేల్లం ధర్మయ్య , నరసింహారావు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: