గుండాల/ఆళ్ల పల్లి ఏప్రిల్ 6(మన్యం మనుగడ) నిరుపేదల పాలిట వరంగా సీఎం సహాయనిధి మారిందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మంజూరు చేయించిన సీఎంఆర్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఆళ్ల పల్లి మండలం లో ఇప్పటివరకు పెద్ద మొత్తంలో చెక్కులు మంజూరు అయ్యాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి రాంబాబు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: