మన్యం మనుగడ, అశ్వరావు పేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని తన దత్తత గ్రామమయిన పూసుకుంట గ్రామాన్ని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సందర్శించారు. కొండ రెడ్ల గ్రామం అయిన పూసుకుంటకు కమ్యూనిటీ హల్, ప్రాథమిక పాఠశాల భవనానికి అదనంగా మరొక గది ఏర్పాటు మరియు ఇతర అభివృద్ధి పనుల కోసం 45 లక్షల రూపాయల చెక్కును జాయింట్ కలెక్టర్ కి అందించారు. గ్రామంలో త్రాగు నీరు, విద్య, వైద్యం అందరికీ అందాలని మరియు పౌష్ఠికాహారం లోపం లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందుకే పౌష్ఠికాహారం లోపం రాకుండా ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డూలను అందించారు. ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు అనీ, పట్టణానికి దూరంగా గిరిజన కొండ రెడ్ల గ్రామాన్ని సందర్శించి వారి జీవన విధానం చూడటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అభివృద్ధి పనులను చూడటానికి మళ్లీ వస్తానని, మీకు ఎటువంటి అవసరం వచ్చినా అధికారులు మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలని అధికారులను కోరారు.
Navigation
Post A Comment: