మన్యం మనుగడ, అశ్వరావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పూసిక గూడెం గ్రామానికి విచ్చేసిన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నీ అశ్వరావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపిపి శ్రీరామ్మూర్తి గవర్నర్ తమిళ్ సై కి మెమొంటో శాలువాతో సత్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల ఔషధాలను, అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్తువులను అయన పరిశీలించారు. అయనతో పాటు అశ్వారావుపేట మండల పార్టి ఉపాధ్యక్షులు బండారు శ్రీను, ఎంపిటిసిలు తిరుపతి రావు, నాగలక్ష్మి, నార్లపాటి రాములు, బాణాల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: