CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారత కమ్యూనిస్టు పార్టీ మండల సమితి అశ్వారావుపేటలో భారీ ర్యాలీ.

Share it:



మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ మండల సమితి భారీ ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఏండ్లు గడుస్తున్నా అర్హులైన పేదలకు దరి చేరడం లేదని మండల పార్టీ కార్యాలయం నుండి దరఖాస్తుదారుల తో భారీ ర్యాలీ నిర్వహించి, అశ్వరావుపేట తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహసిల్దార్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ డిటిఓకు తమ డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వృద్ధాప్య వితంతు వికలాంగులకు ఒంటరి మహిళలకు 57 సంవత్సరములు నిండిన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని, స్వంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని, దళితులు అందరికీ దళిత బందు అమలు చేయాలని, నియోజకవర్గంలో కేవలం వంద మందికి మాత్రమే దళిత బందు అమలు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని సిపిఐ నాయకుడు సలీం డిమాండ్ చేయడం జరిగింది. అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందించాలని తమ డిమాండ్లలో భాగంగా దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి తహసీల్దార్ కార్యాలయ డిటిఓ సుచిత్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అశ్వరావుపేట నియోజకవర్గ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ డి సలీం, సిపిఐ అశ్వరావుపేట మండల కార్యదర్శి జి రామకృష్ణ, మండల ఏఐటీయూసీ నాయకులు రఫీ అహ్మద్, టీ సత్యనారాయణ, సిహెచ్ సత్యవతి, ఎస్ కె రిజ్వానా, టి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: