CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ధాన్యం కొనుగోల్లను వెంటనే ప్రారంభించాలి.రైతు కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చెయ్యాలి

Share it:

 



ములకలపల్లి :మన్యం మనుగడ ప్రతినిధి :

ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ములకలపల్లి లో పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ఇప్పటికే రైతులు ధాన్యం కల్లాలలో వడ్లు ఆరబెట్టి కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఎప్పుడు వర్షం వచ్చి ధాన్యం పాడైపోతుందోనని ఆందోళన చెందుతున్నారని, కావున వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు ఎక్కడ ధాన్యం ఆరబోస్తే అక్కడే వెళ్లి దాన్యం కొనుగోలు చేయాలని, నేరుగా రైతుల ఖాతాల్లోనే వారం రోజులలో డబ్బులు జమచేయాలని డిమాండ్ చేశారు.

ప్రతి సంవత్సరం పెరుగుతున్న పెట్టుబడి కి అణుగుణంగా మద్దతు ధర ఉండటంలేదని ఎరువుల, పురుగుమందులు ,విత్తనాలు ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ధాన్యం మద్దతు ధర కేరళ తరహా లో క్వింటాకు 2575 రూపాయలు ఇవ్వాలని, పంట భీమా ప్రతి రైతుకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ,మండలనాయకులు వి.రవికుమార్,గడ్డం వెంకటేశ్వర్లు, రైతులు వూకంటి రాంబాబు, వినోద్ కుమార్,క్రృష్ణ,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: