మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం లోని పలు గ్రామాల్లో 1/70 చట్టానికి విరుద్ధంగా కడుతున్న అక్రమ కట్టడాలు నిలిపివేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తెల్లం నరసింహారావు, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు సొందే మల్లు దొర ఈరోజు కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలం లో పంచాయతీ, రెవెన్యూ అధికారులు చొరవతో కొంతమంది గిరిజనేతరులు ఏజెన్సీ లో అక్రమ భారీ భవనాలు ,బహుళ అంతస్తులు కడుతున్నారని వాటిమీద అధికారులు ఎల్ టి ఆర్ కేసు నమోదు చేయాలని కోరారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుండి రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని జిల్లా కలెక్టర్ కు తెలిపారు అనుమతులు లేకుండా ఉన్నటువంటి నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమం నాయకులు కోరం మురళి, తెల్లం కామరాజు, వాగే చలపతి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: