మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలపరిదిలోని చొప్పాల గ్రామనికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త గోగు సమ్మయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తన సోదరుడు గోగు వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల చెక్కును అనారోగ్య బాదితుని సోదరుడు గోగు వెంకటేశ్వర్లుకు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు పాయం.నరసింహరావు,బత్తిని.నరసింహరావు,పోలెబోయిన, నరసింహరావు,కొమరం విశ్వనాధం,మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, మాజీ ఎంపీటీసి నిట్టా ఏడుకొండలు,తాటిగూడెం ఉపసర్పంచ్ జాడి.నాగరాజు, నాయకులు చందా.బిక్షపతి, పూనెం.బిక్షపతి,రావుల శ్రీను,పూజారి క్రిష్ణ,రావుల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: