మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ జవ్వాజి.రాధ-సమ్మయ్య, ఉప సర్పంచ్ బోడా.ప్రశాంత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బలహీన వర్గాల ప్రజల రిజర్వేషన్ల కోసం అభ్యున్నతి కోసం కృషి చేశారని దేశ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తొలెం.నర్సయ్య,గ్రామకమిటి అధ్యక్షులు అయ్యెరి.వెంకటేశ్వర్లు, మైత వసంతరావు,రామటెంకి శేఖర్, గోగు.లక్ష్మయ్య,సల్లురి. రాంబాబు.పుల్లయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: