మన్యం మనుగడ కరకగూడెం: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో 131 వ జయంతి సందర్భంగా కరకగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బహుజన అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడిన నిస్వార్థ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. స్వతంత్ర దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ జీవనం గడపాలని ఆశించిన మహానీయుడు డాక్టర్ అంబేద్కర్ అన్నారు ఈ కార్యక్రమంలో బట్టుపల్లి సర్పంచ్ తోలెం. నాగేశ్వరరావు, నాగబండి వెంకటేశ్వర్లు, షేక్ రఫీ,రవీందర్, కిరణ్, పాల్గొన్నారు.
Post A Comment: