- అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి.
- అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీపీ జనగాం సమ్మక్క.
మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కన్నాయి గూడెం మండల కేంద్రములో
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ పూలమాల వేసి నివాళులర్పించిన కన్నాయి గూడెం ఎంపీపీ జనగం సమ్మక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ.కుల,మత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ తన జీవిత కాలం పోరాటం చేశారని, అన్నారు.దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమా పేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని, అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు.
చిన్న నాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారని,ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవి,అని అన్నారు.ఈ సందర్భంగా ఆయనకు యావత్ భారతా వని నివాళులు అర్పిస్తోందని ఆయన ఆశయాలను కొనసా గించాలని అన్నారు.ఈ కార్య క్రమంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్య క్షులు అబ్బు రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సునార్కాని రాంబాబు,ఎస్సీ సెల్ మండ ప్రధాన కార్యదర్శి అంబాల సమ్మయ్య,బీసీ సెల్ మండల అధ్యక్షులు కటకం మల్లన్న,
యూత్ మండల అధ్యక్షులు బోట నాగేశ్,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షులు బొగ్గుల సుధాకర్,లక్ష్మీపురం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏర్లోల నర్సింగ
రావు,అంబాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: