మన్యం టివి దుమ్ముగూడెం::
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకునే రాజకీయ రంగంలో ప్రవేశించి తెలుగుదేశం పార్టీ స్థాపించి భారతదేశం గర్వించదగ్గ నటుడిగా రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని దుమ్ముగూడెం మండల తెలుగుదేశం అధ్యక్షుడు దామోదర్ రావు డిమాండ్ చేశారు ఎన్టీఆర్కు భారత రత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్తో ఈనెల 27వ తేదీన అఖిలపక్ష ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలం గ్రామంలో ఎస్బిఐ బ్యాంకు ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఈ బహిరంగ సభలో అధిక సంఖ్యలో జనాభా వచ్చి ఎన్టీఆర్ అభిమానులు ప్రజలు సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు .ఈ అఖిలపక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే పొందేం వీరయ్య పాల్గొంటారాని, అలానే స్థానిక నేతలు ఈ సమావేశం లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు హాజరవుతారని తెలియజేశారు.
Post A Comment: