మన్యం మనుగడ/ వాజేడు:
మినీ గురుకుల పాఠశాలల్లో 1వ తరగతి నుండి ఐదో తరగతి వరకూ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది.గురుకుల జిల్లా అధికారి ఆర్ సి ఓ, రాజ్యలక్ష్మి, ఆదేశాల మేరకు,
వాజేడు, జంగాలపల్లి మినీ గురుకుల విద్యాలయాల సంస్థలో 2022-2023 అకడమిక్ ఇయర్కి గాను 1 తరగతి, నుండి 5వతరగతి ,లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.అర్హత గల విద్యార్థులు, మే 4వ, తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరని, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. రోహిణి.పత్రిక ప్రకటనలో తెలిపారు. ఎంపిక విధానం ఐటీడీఏ, పీవో ఏటూర్ నాగారం ఆధ్వర్యంలో విద్యార్థులకు, డ్రా ద్వారా ఎంపిక జరుగుతుందని తెలిపారు.
ఖాళీల వివరాలు.
1వ తరగతిలో 30 సీట్లు
2వ తరగతిలో 7 సీట్లు
3వ తరగతిలో 4 సీట్లు గా ఉన్నాయి. పూర్తి వివరాల కొరకు వాజేడు మండల కేంద్రంలో బాలికల మినీ గురుకులం పాఠశాలలో సంప్రదించగలరని ప్రధాన ఉపాధ్యాయురాలు పి. రోహిణి తెలిపారు.
Post A Comment: