CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంబేద్కర్ ఆశయాలను సాధించాలి.ఆయన జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలి. .

Share it:

 


  • అంబేద్కర్ జయంతి,వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరపాలి.
  • సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్.

మన్యం మనుగడ ఏటూరునాగారం

విశ్వరత్న, ప్రపంచ మేధావి, భారత రత్న, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని , ఎస్సీ ఎస్టీ బీసీ,మైనార్టీలంతా ఐక్యతతో ఆ మహనీయుని ఆశయ సాధనకు కృషి చేయాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ పేర్కొన్నారు. గురువారం సమతా సైనిక దళ్ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ అంబేద్కర్ 131 వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు,నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడని,సమానత్వం కోసం, నవభారత నిర్మాణం కోసం తన భార్యా పిల్లలను త్యాగం చేసిన మహానీయుడన్నారు.తను రాసిన రాజ్యాంగ ఫలాలు అందరూ అనుభవిస్తూ ఆయన్ని కొందరికి మాత్రమే పరిమితం చేయడం సరికాదన్నాను, కొందరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.దేశ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని, ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని అధికారికంగా ఘనంగా నిర్వహించాలని, ఆ మహనీయుని జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో పొందుపర్చి విద్యార్థులకు బోధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బానాసా అధ్యక్షుడు కొండగొర్ల రాజేష్, సమతా సైనిక దళ్ సభ్యులు గోస్కుల రాంబాబు,కుమ్మరి చిన వెంకటి,సునార్కని నర్సింహారావు,రామ్మూర్తి, కావేరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: