CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

యాసంగి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తాం జిల్లా రైతుబందు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి...

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:చండ్రుగొండ : యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి స్పష్టం చేశాడు. గురువారం గానుగుపాడు సహకార సంఘం పరిధిలోనే తిప్పనపల్లి,తుంగారం, పోకలగూడెం గ్రామాలలో ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం యాసంగి రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రానికో విధానాన్ని అవలంబిస్తూ రాజకీయాలు చేస్తోందని ఆరోపించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రైతులు ధైర్యంగా నేరుగా వచ్చి ధాన్యాన్ని అమ్ముకోవచ్చున్నారు. రైతులు తాము పండించిన పంటను పూర్తి స్థాయిలో ఆరబెట్టుకుని తేమశాతం 17 శాతం లోపు ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గానుగపాడు సహకార సంఘం అధ్యక్షులు చెవుల చంద్రరావు, ఎంపీపీ భానోత్ పార్వతి,సర్పంచులు ధరావత్ రామారావు,భానోత్ కుమారి, ఎంపిటిసి లంక విజయలక్ష్మి,జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, తహసిల్దార్ ఉషశారద, ఎంపీడీఓ అన్నపూర్ణ,సొసైటీ సీఈఓ లంక నరసింహారావు, మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్ బాబు, సొసైటీ డైరెక్టర్లు ఉన్నం నాగరాజు, పసుపులేటి వెంకటేశ్వర్లు, రామిశెట్టి సరళ,టిఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ బోజ్యానాయక్, గాదె లింగయ్య వెంకటేశ్వర్లు,సయ్యద్ గఫార్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: