మన్యం టీవీ దుమ్ముగూడెం::
రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా. బి ఆర్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలను టి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ములకపాడు వద్ద బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి మండల అధ్యక్షులు అన్నె.సత్యనారాయణ మూర్తి , జడ్పిటిసి తెల్లం సీతమ్మ ,ఎం పి పి రేసు లక్ష్మీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించరూ.ఈ సందర్భంగా అన్నె సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ చిన్న నాటినుండి ఎంత వివక్ష ఎదురైనా మొక్కవోని దీక్ష తో చదువే లక్ష్యంగా అత్యంత ఉన్నతమైన చదువులు చదివి ప్రపంచ మేధావిగా గుర్తింపు తెచ్చుకుని మన భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.ఆయన మనకు అందించిన రాజ్యాంగ ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని,భారతదేశంలో కులవ్యవస్థ పోవాలని ఆశించిన ఆయన భారత పౌరులందరికి ఆదర్శనీయుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ మండల ప్రధానకార్యదర్శి కణితి రాముడు, అధికారప్రతినిది ఎం డి. జానీపాషా,యం పి టి సి లు మడకం రామారావు,సోడి తిరుపతి రావు, సర్పంచ్ సోడి జ్యోతి,తెల్లం రామకృష్ణ,సోడి కొండయ్య, నాయకులు దామెర్ల శ్రీనివాస్,కెల్లా శేఖర్,కణితి లక్ష్మణ్,మహిళా విభాగం కార్యదర్శి పూసం సావిత్రి, కొత్తూరి సీతారామారావుతదితరులు పాల్గొన్నారు.
Post A Comment: