దమ్మపేట ఏప్రిల్ 19 ( మన్యం మనుగడ ) : దమ్మపేట అర్బన్ కాలనీ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 7,25,000/- తో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మల్కారం గ్రామంలో 20,59,448/- తో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంబించారు.
మల్కారం గ్రామంలో లక్కదాసు వెంకటేశ్వరరావు అనారోగ్యం తో బాధపడుతుండటంతో ఈరోజు వారి నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు. అలాగే దమ్మపేటలో సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం పనులను ప్రారంబించారు అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటించారు
ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపు రేకలు పూర్తిగా మారిపోతున్నాయి అని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అలోచన రేపటి తరానికి బంగారు భవిష్యత్తునీ కల్పిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ ధార యుగంధర్ అంకత ఉమామహేశ్వరరావు,టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు , సైధ పగడాల రాంబాబు చిన్నసెట్టీ యుగంధర్ ,పానుగంటి చిట్టి బాబు ,కావులురి నాగయ్య ,అబ్దుల్ జిన్నా ,నందం ,రొయ్యల కుమార్ బుద్ధ కోటేశ్వరావు ఎంపీటీసీ నాయుడు శ్రీనివాసరావు సర్పంచ్ రూప్ సింగ్ గారు సర్పంచ్ తోట రాజు తిరువీధుల జేమ్స్ రావూరి వీరయ్య ,ఎక్స్ ఎంపీపీ అల్లం వెంకమ్మ , గ్రామ కమిటీ అన్నవరపు పుల్లారావు తిరువీధుల ధనరాజు నాగేంద్ర రావు ,అధికారులు MRO ,MEO ,DE,AE ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: