- రాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛంద సేవ చేసిన గ్రామ యువకులు
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పంచాయతీ రావిగూడెం గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛంద సేవ చేశారు. రావిగూడెం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాల ఆవరణలో 10 సంవత్సరాల క్రితం చేతి పంపు ఏర్పాటు చేశారు. ఆ పరిసర ప్రాంతం అంతా ప్రస్తుతం మురికి నీరుతో నిండి ఉండటం వలన విద్యార్థులు నీటిని తాగడానికి ఇబ్బంది పడుతున్నారు. కాలక్షేపం కోసం పాఠశాల సమయం ముగిసిన తర్వాత అక్కడకు చేరుకునే యువత, చాలా రోజుల నుండి ఈ విషయాన్ని గమనిస్తున్నారు. అనుకున్నదే తడవుగా స్నేహితులు ఏకమై మురికి మయంగా ఉన్న చేతి పంపు పరిసర ప్రాంతాలను తామే శుభ్రం చేసి, రాళ్లతో నింపడం జరిగింది. సొంత ఖర్చులతో సిమెంటు తీసుకొనివచ్చి, మేస్త్రి ని పిలిపించి, చేతి పంపు ఆవరణ చుట్టూ దిమ్మె నిర్మించడం జరిగింది. ప్రస్తుతం పాఠశాలకు చెందిన విద్యార్థులు సంతోషంతో చేతి పంపు నుండి వచ్చే నీటిని ప్రశాంతంగా తాగుతున్నారు. కాలక్షేపం కోసం కూర్చునే యువతకు ఇలాంటి ఆలోచన రావడం బాగుందని, పలువురికి ఆదర్శంగా నిలిచారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఇంత మంచి కార్యం చేసిన రాయిగూడెం యువకులు పడిగెల చిరంజీవి, మునిగెల బాలకృష్ణ, పొనగంటి కృష్ణ ప్రసాద్, పొనగంటి చెన్నకేశవులు, పొనగంటి నరసింహారావు లను రాయిగూడెం గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.
Post A Comment: