మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సందర్శించారు.ఈ సందర్భంగా ప్రముఖ కాంట్రాక్టర్ పి.వి.చారి 25 కుర్చీలు,రాము 10 కుర్చీలను ప్రభుత్వ ఆసుపత్రికి వితరణగా విప్ రేగా కాంతారావు చేతులమీదుగా ఆసుపత్రి అందజేశారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,ఆసుపత్రి సూపరింటెండెంట్ గిరి ప్రసాద్, ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,నియోజకవర్గ యువజన కార్యదర్శి బోశెట్టి. రవి ప్రసాద్,గుర్రం సృజన్, స్థానిక నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: