మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను రావులపల్లి కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏప్రియల్ 17వ తేదీన భద్రాచలం శ్రీ వీరభద్ర ఫంక్షన్ హాల్ నందు రావులపల్లి రవి కుమార్ కుమార్తె సింధు వివాహ వేడుకకు హాజరు కావాలని కోరుతూ,ప్రభుత్వ విప్,రేగా కాంతారావు కు ఆహ్వాన పత్రికను కుటుంబ సభ్యులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ల జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,స్థానిక ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: