CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాష్ట్ర ప్రజలకు రామనవమి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

Share it:

 



మన్యం టీవీ వెబ్ డెస్క్:


రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. 


 ధర్మో రక్షతి రక్షితః సామాజిక విలువను తుచ తప్పకుండా ఆచరించి,ధర్మాన్ని విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు శ్రీ సీతారామ చంద్రుడు అని, భారతీయుల ఇష్ట దైవమని సీఎం కేసీఆర్ కీర్తించారు. 


లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన శ్రీ సీతారాముల పవిత్ర పుణ్య దంపతుల బంధం అజరామరమైనదని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని సీఎం తెలిపారు.


భద్రాచల శ్రీ సీతారాముల వారి ఆశీస్సులు సదా రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని శ్రీ సీతారామ చంద్ర మూర్తులను సీఎం కేసీఆర్ ప్రార్ధించారు.

Share it:

TS

Post A Comment: