మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,రేగా కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం నాడు మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.విప్ రేగా జన్మదినం సందర్భంగా మణుగూరుకు చెందిన వేద పండితులు, ముస్లిం మత పెద్దలు వారి ఆశీర్వచనాలు అందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న రేగా కాంతారావు కు ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని,భగవంతుడు చేకూర్చాలని కోరారు. నియోజకవర్గంలోని పేద ప్రజలకు తనవంతుగా రేగా విష్ణు ట్రస్ట్ ద్వారా చేస్తున్న సహాయాన్ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వేదపండితులు, మజీద్ ఇమామ్ సాహెబ్ ఎస్.కె ఇస్మాయిల్ మణుగూరు కో ఆప్షన్ జావిద్ పాష,టౌన్ ప్రెసిడెంట్ రహీం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: