మన్యం మనుగడ/వాజేడు:
వాజేడు మండల కేంద్రంలోని జగన్నాధపురంలో నూతనంగా మంజూరైన మీసేవ కేంద్రాన్ని మంగళవారం నూగురు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొదేబోయన బుచ్చయ్య, తహసిల్దార్ సర్వర్ పాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీసేవ సర్వీసులను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు స్వల్ప ఖర్చుతో కూడిన వివిధ రకాల సర్వీసులను మీ సేవా కేంద్రాలలో సులభంగా వేగంగా కావలసిన సమాచారాన్ని పొందేందుకు మీసేవ కేంద్రాలు ఏర్పర్చారు. వాజేడు మండలం లో మీసేవ కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రజల అవసరాల దృష్ట్యా మరో మీ సేవ కేంద్రo సర్వీసును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాసిల్దార్ రాహుల్ చంద్ర వర్మ, హెచ్ ఈ ఓ వేణు గోపాల కృష్ణ, ఉప సర్పంచ్ సునీల్, మీసేవ నిర్వాహకులు బోదెబోయ గురుదేవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: