మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలంలో ములకపాడు సెంటర్లో ఉన్న యలమంచి సీతారామయ్య భవనంలో మాజీ ఎమ్మెల్యే అమరజీవి కామ్రేడ్ కుంజా బోజ్జి ప్రధమ వర్ధంతి సభలో బోజ్జి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వర్ధంతి సభలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య మాట్లాడుతూ అమరజీవి కుంజా బోజ్జి భద్రాచలం డివిజన్ లో ఈ ఏజెన్సీ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మచ్చలేని పరిపాలన అందించారని కుంజా బోజ్జి బడుగు బలహీన వర్గాల ఏజెన్సీ ముద్దుబిడ్డ అని ఆయన గుర్తు చేశారు అట్లాంటి కుంజా బుజ్జి గారు యొక్క స్ఫూర్తి తోటి సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు దుమ్ముగూడెం మండలంలో భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన ఈ సందర్భంలో పిలుపునిచ్చారు. కుంజా బోజ్జి గారు భద్రాచలం ఉమ్మడి డివిజన్లో వాజేడు నుండి మొదలుకొని చింతూరు మండలం మోతుగూడెం వరకు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సాగునీరు తాగునీరు విద్య వైద్యం కోసం కరెంటు లేని గ్రామాల్లో కరెంటు వేయించడం ఇలా అనేక అభివృద్ధి పనులలో ముందుండి పోరాడిన మహా నాయకుడు డు సుందరయ్య అని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు జి పద్మ, జిల్లా కమిటీ సభ్యురాలు చిలకమ్మా, జిల్లా కమిటీ సభ్యురాలు సరియం రాజమ్మ ,పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీనుబాబు, పార్టీ మండల కమిటీ సభ్యులు ఎండి మహమ్మద్, లక్ష్మీ నగరం ఉపసర్పంచ్ గుడ్ల రామ్మోహన్ రెడ్డి ,ఎస్.కె మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: