మన్యం టీవీ దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని జిన్నెగట్టు గ్రామంలో నిన్న రాత్రి ప్రమాద వశాత్తు నిప్పంటుకుని ఇల్లు కాలిపోయిన కుటుంబాలకు చెందిన భాదితులకు టి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.తెల్లం వెంకట్రావు చేతులమీదుగా టిఆర్ఎస్ పార్టీ, సమ్మక్క-సారక్క దేవాలయ కమిటీ ల ఆద్వర్యంలో ఒక్కోకుటుంబానికి 2000 రూపాయలు నగదు,20 కేజీలబియ్యం,వంటసామాగ్రి,నిత్యావసరాలు, 5చీరలు చొప్పున,పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదం లో సర్వము కోల్పోవడం బాధాకరం అని,భాదితులకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన సంక్షేమ పథకాలను త్వరితంగా మంజరి చెపిస్తామని,ధైర్యంగా ఉండాలని అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి,ప్రధానకార్యదర్శి కణితి రాముడు, ఉపాధ్యక్షుడు అపకా వీర్రాజు, ఎం పి టి సి మడకం రామారావు, సీనియర్ నాయకులు కొత్తూరి సీతారామారావు, వెంకన్న రాజు,వర్మరాజు,కల్లూరి వీరభద్రం,దేవరబాలలు మడకం అచ్చమ్మ,సోడి శాంతమ్మ,అపకా అశ్వని తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: