మన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను బైరగులపడు, దుమ్ముగూడెం కేంద్రాలను ఈరోజు ఎం పి పి రేసు లక్ష్మీ ,జడ్ పి టి సి తెల్లం సీతమ్మ ప్రారంభించారు.వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం కొనడానికి ముందుకు రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలను ప్రారంభించడం గొప్ప తీసుకొని ఈ సందర్భంగా తెలియజేశారు అలానే వారు మాట్లాడుతూ వరి ధాన్యం రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో దాన్యం విక్రయిస్తే సరైన మద్దతు ధర వస్తుందని అన్నారు.రైతులందరూ వీటిని సద్వినియోగం చేసుకొని కేంద్రాల్లో ధాన్యం విక్రయించి సరైన మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు బత్తుల శోభన్, టి ఆర్ ఎస్ మండల కార్యదర్శి కణితి రాముడు, సొసైటీ డైరెక్టర్ శ్రీనుబాబు, వ్యవసాయ అధికారి నవీన్ కుమార్ , సిబ్బంది గంగరాజు, జయసింహ ,ప్రభకర్ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ..
Post A Comment: