దమ్మపేట ఏప్రిల్ 15 ( మన్యం మనుగడ ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట
భారత జాతీయ మహిళా సమాఖ్య దమ్మపేట మండలం 9వ మహాసభ ఎస్ కే జాను అధ్యక్షున జరిగింది
ఈ సందర్భంగా మహిళలు ఉద్దేశించి జిల్లా మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి మున్నలక్ష్మి కుమారి సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మండలంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మహిళలకు భద్రత కరువైందని మహిళలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మహిళలకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని వడ్డీలేని రుణాలు అందించాలని మహిళలపై వేధింపులకు పగడ్బందీగా చట్టం ఏర్పాటు చేయాలని అన్ని రంగాల్లో ఉన్న మహిళలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పండూరు వీరబాబు ఏఐవైఎఫ్ నాయకులు ధర్మ పదం విజయలక్ష్మి బేల్లం కృష్ణవేణి తుపాకుల శాంతి జాన్ బి తిరుపతమ్మ వీరలక్ష్మి గాజుబోయిన కృష్ణవేణి నక్కనాగమణి తాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: