మన్యం టివి దుమ్ముగూడెం::
లక్ష్మీ నగరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని డా.బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు మాట్లాడుతూ డా.బాబూ జగ్జీవన్ రామ్ కులరహిత సమాజం కొరకు పోరాడిన మహాయోధుడు అని చట్టసభల్లో ఓటమి ఎరుగని నాయకులుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మీ, జడ్పిటిసి తెల్లం సీతమ్మ, పార్టీ అధికారప్రతినిధి ఎండి జానీపాషా, ప్రచారకమిటి అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు,ఎం పి టి సి మడకం రామారావు,సొసైటీ డైరెక్టర్ పిసోడి వెంకటేష్, జిలకర గంగరాజు, తంత్రపల్లి వెంకటేశ్వర్లు,పొడకల పల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: