మన్యం మనుగడ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు కి కరకగూడెం పరిధిలోని బర్లగూడెం గ్రామ ప్రజలు రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వడ్ల గూడెం గ్రామం లోని 19 లక్షల 75 వేల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టిన త్రీఫేస్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, బోర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను రాజుగా చూడడం కోసం కోసం ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం రైతు బంధు రైతు బీమా అనే సంక్షేమ పథకాలతోపాటు రైతుల కోసం ప్రాజెక్టులు బోరుబావుల తో పాటు త్రీఫేస్ సింగల్ ఫేస్ అంటే విద్యుత్ 24 గంటల సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఎడి కె.జీవన్ కుమార్, ఏఈ రామకృష్ణ, సబ్ ఇంజనీర్ వీరారెడ్డి, స్థానిక ఎంపీపీ రేగా కాళిక సర్పంచ్ పోలెబోయిన.నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లేటి భవాని శంకర్,వట్టం.రాంబాబు, సర్పంచులు పాయం నరసింహారావు,కొమరం.విశ్వనాథం, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు మండల అధ్యక్షులు ఆకుల సోమయ్య ఉపాధ్యక్షులు రామనాధం నాయకులు వెంకట్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, బుడగం.రామ్ కొంపల్లి పెద్ద రామలింగం, నిట్డా.ఏడుకొండలు, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు ఆయన రాజబాబు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
Post A Comment: