మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో రైతులు కెసిఆర్ చిత్ర పటానికి పాలభిషేకం చెయ్యడం జరిగింది. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించటం హర్షనీయం అని అశ్వారావుపేట మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ అన్నారు. రైతులు ఎవరూ తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దని భరోసానిస్తూ రూ.1930 చొప్పున ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటన చేయటం తెలంగాణ యావత్ రైతు సోదరులకు ఊరటనిచ్చే పరిణామన్నారు. ఈ నేపధ్యంలో అన్నదాతల పక్షాన తాను ప్రత్యేక కృతజ్ఞతలను సీఎం కేసీఆర్, కేటీఆర్లు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తానని చెప్పడం గర్వించదగ్గ విషయం అన్నారు. రైతు పక్షపాతిగా కొనసాగుతున్న సీఎం కేసీఆర్ రాబోవు తరాల్లోనూ ఆయనే సీఎంగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: