మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారాయణపురం గ్రామంలో చోరీ, సోమవారం అర్ధరాత్రి తుంగ సీతారామమ్మ, కోడలు వెంకటరమణ, వారి ఇంటి పైన డాబా మీద నిద్రిస్తున్న సమయంలో దొంగలు అర్ధరాత్రి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలో ఉన్న నాలుగు కాసులు గొలుసు, చిన్నపిల్లలు గొలుసు ఒక కాసు, నల్ల పూసల తాడు ఒక కాసు, రెండు జతల పట్టీలు, రెండు ఉంగరాలు, లక్ష రూపాయలు క్యాష్ చోరీ చేశారు. తెల్లవారుజామున నిద్ర లేసి పనికి వెళ్దామని ఇంటి తలుపులు తీసే క్రమంలో ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఉండడంతో చుట్టుపక్కల వారిని పిలిచి లోపలికి వెళ్ళేసరికి ఇంట్లో ఉన్న బీరువా లో సామాన్లు మొత్తం చెల్లా చెదురుగా కనిపించడంతో, దొంగతనం జరిగిందని గమనించి మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట సబ్ ఇన్స్పెక్టర్ చల్లా అరుణ, సంఘటన స్థలానికి చేరుకొని, క్లూ టీమ్స్ తో వేలిముద్రలు సేకరించారు.
Post A Comment: