CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం.మృతుల కుటుంబాలకు పరామర్శ.

Share it:

 


  • 75 కిలోల బియ్యం ఆర్ధిక సహాయం.
  • ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం.
  • సమత ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరునాగా రం రోయ్యూరు గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు బెడిక సతీష్ ,ఆకుదారి సాయి వర్ధన్,దొంగరి సందీప్ లు

గోదావరి నదిలో స్నానానికి దిగి మృతి చెందిగా వారి కుటుంబాలను బుధవారం సమతా ఫౌండేషన్ ములుగు జిల్లా సభ్యులతో కలిసి సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ పరామ ర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ.భవిష్యత్తు లో ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన విద్యార్థులు ఉగాది పర్వదినాన గోదావరి స్నానానికి వెళ్లి మృ త్యువాత పడడం బాధాకరమ న్నారు.మృతుల కుటుంబాలకు సమత ఫౌండేషన్ ద్వారా అండగా ఉంటామని భరోసా నిచ్చారు.మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాగ భూమయ్య,

సభ్యులు,కొండగొర్ల పోచయ్య,

కావిరి అర్జున్,కొండగొర్ల రాజేష్, కుమ్మరి రాంబాబు,దుర్గం రామారావు,జనగం కేశవరావు,

కావిరి అభినందు,సోదారి రమేష్,కొండగొర్ల దుర్గారావు, దుర్గం రాజేష్,సోదారి హరీష్,

సోదారి రామయ్య గజ్జెల శంకర్,దుర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: