మన్యం మనుగడ కరకగూడెం: మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా.కాంతారావు పుట్టిన రోజు వేడుకలు సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు,పాయం నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ హాస్పటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుంది అంటే రేగ కృషి వల్లనే జరుగుతుందని ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే ఏకైక నాయకుడు ఆదివాసీల ముద్దుబిడ్డ రేగా కాంతారావు అని వారు అన్నారు.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఉన్నత స్థానంలో ఉండి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని వారన్నారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా రేగా గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు ఇర్ప.విజయ్ కుమార్,బత్తిని. నరసింహారావు,కొమరం విశ్వనాథం,పోలెబోయిన పాపమ్మ ,జవ్వజి రాధా,భూక్యా భాగ్యలక్ష్మి ,అర్జున్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: