మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట పోలీస్ స్టేషన్ ఎస్ ఐ తాహెర్ బాబా ఆధ్వర్యంలో మండలం లోని అన్ని మతాల, కుల పెద్దలతో శాంతియుత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లో భాగంగా అందరూ కలసి మెలసి సోదర భావం తో ఒకరికొకరు సహకరించుకుంటూ మెలగాలని తద్వారా ప్రతి ఒక్కరూ ఆర్ధికంగా ఎదగాలని సూచనలు చేశారు. ఈ సందర్బంగా కుల, మత పెద్దలతో శాంతియుత కమిటీ ఏర్పాటు చేశారు దీని ద్వారా ప్రతి ఒక్కరూ సోదరభావంతో, సమానత్వం తో కుల, మతాలకు అతీతంగా ఎటువంటి సమస్యలు వచ్చిన శాంతియుతంగా శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేసుకోవాలి దానికి శాంతి యుత కమిటీ పెద్దలు సభ్యులు సహకరించాలని సూచనలు చేశారు.ఈ సమావేశం లో మంగపేట మండలం లోని మత, కుల పెద్దలు పాల్గొన్నారు.
Post A Comment: