గుండాల/ఆళ్లపల్లి ఏప్రిల్ 15(మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండలం లో రేగా నగర్ పై కొందరు చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహా రావు ఒక ప్రకటనలో అన్నారు. ప్రభుత్వ భూమిని గుర్తించి నిరుపేదలకు ఇవ్వడం సర్వసాధారణమైన విషయం అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుండి భూమి తీసుకొని నిరుపేదలకు ఇస్తే తప్పు అవుతుంది గాని ప్రభుత్వ భూమిని గుర్తించి భూమి లేని నిరుపేదలకు ఇవ్వడం ఎలా అవుతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారు మానుకోవాలని ఆయన సూచించారు
Post A Comment: