మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రిల్ ( 03 ) ఆదివారం ;- దమ్మపేట మండల కేంద్రంలో ఈ రోజు సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు కు నిరసనగా ప్రదర్శన ధర్నా చేశారు మండల కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపింది ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాగానే ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల సిపిఎం కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మీనారాయణ కొప్పుల శ్రీనివాసరావు భోగి నరసింహారావు మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: