CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మనఊరు-మనబడి తో పాఠశాలలకు మహర్దశ..పంచాయతీరాజ్ శాఖ డిఈ సత్యనారాయణ....

Share it:

  



మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని పంచాయతీ రాజ్ శాఖ డిఈ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన పరిశీలించి, మనఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టవలసిన పనులను అంచనా వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...డివిజన్ పరిధిలో మనఊరు-మనబడి కార్యక్రమం లో ఫేస్ ఒన్ క్రింద 18 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, త్వరలో అంచనాలు వేసి, పనుల మంజూరీ కోసం ప్రతిపాదనలు పంపి, అనుమతులు రాగానే పనులు మొదలు పెట్టడం జరుగుతుందన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పిఆర్ ఏ ఈ శ్రీనివాస రావు, హెచ్ఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: