మన్యం మనుగడ ప్రతినిధి చంద్రుగొండ: మండల కేంద్రమైన చండ్రుగొండ లోని ప్రధాన సెంటర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఉపసర్పంచ్ బాబురావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం ఎండల తీవ్రతను అంచనావేసి ప్రధాన సెంటర్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మండల వాసులు, ప్రయాణికులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిరోజు చల్లటి నీటిని ఇచ్చేలా పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సంజీవరావు, ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంపీ ఓ తోట తులసీరామ్, ఎంపీటీసీ దార బాబు, టిఆర్ఎస్ మండల నాయకులు చీదేళ్ళ పవన్ కుమార్, వంకాయలపాటి బాబురావు, పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: