CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆర్థిక సహాయాన్ని అందించిన ఎంపీపీ లావుడ్యా సోనీ..

Share it:


మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ రమాదేవి దగ్గరి బంధువు అయినా బానోత్ రమణి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీపీ లావుడ్యా సోనీ శుక్రవారం వారి స్వగ్రామమైన దుబ్బ తండా వెళ్లి రమణి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి, నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాకర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ రమాదేవి, కాకర్ల ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్, బోజ్యా తండా గ్రామపంచాయతీ సర్పంచ్ లావుడ్యా కిషన్ లాల్, బానోత్ దశరథ్, బద్రు, సంజు, లాలయ్య గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: