మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: క్రీస్తు చూపిన బాటలో మనమంతా పయనిద్దామని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. యేసు క్రీస్తు మార్గం అనుసరించదగ్గదని, దీనిని ప్రతి ఒక్కరూ స్పూర్తి గా తీసుకోవచ్చన్నారు. అని మతాలు సమానమేనని, ఇతరుల పట్ల ప్రేమను చూపిన వారే జీవితంలో ముందుకు వెళ్తామన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు అంబేద్కర్ కాలనీ నుండి ఆర్సీఎం చర్చి వరకు భారీ ప్రదర్శన, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ మోహన్ రావు, భూపతి శ్రీనివాసరావు, సత్తి నాగేశ్వరరావు, చీదెళ్ళ పవన్ కుమార్, మద్దిరాల చిన్న పిచ్చయ్య, ఉన్నం నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: