గుండాల ఏప్రిల్ 15(మన్యం మనుగడ) మండలంలో అక్రమ వ్యాపారం చేస్తున్న గుట్కా, గంజాయి వ్యాపారుల పై ప్రత్యేక నిఘా పెడతామని గుండాల ఎస్ ఐ బాధ్యతలు చేపట్టిన కిన్నెర రాజశేఖర్ మన్యం మనుగడతో అన్నారు. గుట్కా, గంజాయ్ తీసుకోవడం వలన వాట్ కి బానిసలై చాలామంది ఇబ్బందులకు గురవుతారని అలాంటివాటిని మండలంలో ప్రజలు ప్రోత్సహించదు అన్నారు. ఇప్పటికైనా ఈ వ్యాపారాలు నిర్వహించే వారు మానుకోవాలని లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. వాహనదారులు తప్పకుండా అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు వీటితో పాటు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు
Post A Comment: