- మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి:జర్నలిస్ట్ సంఘాలు
మన్యం మనుగడ, అశ్వాపురం:ఇసుక లారీ ఢీకొని ఇద్దరు విలేకరుల మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు ,నమ్మదగిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.భుర్గంపాడ్ మండలం
కృష్ణా సాగర్ , భద్రాచలం x రోడ్ మధ్యలో .అశ్వాపురం మండలం కు చెందిన.. అసిఫ్ పాషా (పొలిటికల్ పవర్ ) పినపాక నియోజకవర్గ పత్రిక రిపోర్టర్, మరియు బిష్మారెడ్ది బిజి కొత్తూరు (వాస్తవం ) నియోజకవర్గ పత్రిక రిపోర్టర్ ఇద్దరూ కలిసి భద్రాచలం క్రాస్ రోడ్డు.కు మంగళవారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో వెళ్తున్నారు.ఈ క్రమంలో మణుగూరు నుంచి .కొత్తగూడెం వైపు వెళుతున్న లారి.AP 16 TG2454 నెంబర్ గల లారి ముందు వెళుతున్న మోటార్ సైకిల్ ని ఢీకొని..30 మీటర్లు మేర ఇడుచుకొనివెళ్ళింది.ఈ సంఘటలో అసిఫ్ అక్కడక్కడే మరణించాడు..బిష్మ రెడ్డి. తీవ్రంగా గాయపడ్డాడు.108 అంబులెన్స్.లో భద్రాచలం ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు చికిత్స పొందుతూ భీష్మ రెడ్డి మృతి చెందాడు. బిష్మ రెడ్డి కి ఇద్దరు కూతుర్లు భార్య ఉన్నారు అసిఫ్ కి 6 నెలల కొడుకు.బార్య.ఉన్నారు. ఈ ఘటనతో అశ్వాపురం మండలం లో విషాద ఛాయలు అలముకున్నాయి.మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి జర్నలిస్ట్ సంఘాలు కోరాయి.
Post A Comment: