CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

Share it:


మన్యం మనుగడ, పినపాక 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి ధాన్యం రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో దాన్యం విక్రయిస్తే సరైన మద్దతు ధర వస్తుందని అన్నారు. రైతులందరూ వీటిని సద్వినియోగం చేసుకొని కేంద్రాల్లో ధాన్యం విక్రయించి సరైన మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాలలో ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960.బి గ్రేడ్ వరి ధాన్యం రకానికి రూ.1940 మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుందన్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకో వచ్చే ముందు రైతులు పట్టా పాస్ బుక్ జిరాక్స్ , ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలన్నారు.

 ఈ కార్యక్రమంలో పినపాక మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: