మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన అరవ సందీప్ కుమార్- శ్రీలతల కూతురు అరవ కోరిక్షత అనే చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం
రూ.3 లక్షల రూపాయల ఎల్ఓసీ మంజూరు చేసింది. గురువారం తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు రూ.3 లక్షల రూపాయల ఎల్ఓసీని చిన్నారి తల్లి తండ్రులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: