మన్యం మనుగడ ప్రతినిధి,అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సిపిఐ ఏఐటీయూసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి స్థానిక యూనియన్ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో తొలుత అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ ప్రసంగిస్తూ నిచ్చేనా మెట్ల కుల వ్యవస్థ అంతమయ్యే వరకు అంబేద్కర్ పోరాట స్పూర్తితో యూవత ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ ప్రజా సంఘాల నాయకులు మేళాపుర సురేందర్ రెడ్డి చిలక విశ్వనాధం గంట క్రాంతి కిరణ్ రెడ్డి గుండ్రం సైదిరెడ్డి బాగోతపు సతీష్ చెలికాని శ్రీనివాస్ దళిత హక్కుల పోరాట సమితి నాయకులు బేతం ప్రభాకర్ యెడల్లి కమలాకర్ ఇనపల్లి పవన్ సాయి మాదిగ హక్కుల దండోరా నాయకులు నరేష్ కుమార్ చుంచు ప్రవీణ్ ఏఐటీయూసీ నాయకులు మల్లెం మోహన్ బోనాల శ్యామ్ ఎస్ కె షబ్బీర్ తులసి అనందరావు గరటి రాంబాబు సూర్య ప్రకాష్ ముత్తాబోయిన అరవింద్ కొమ్ము రాంబాబు తోట వెంకటనర్సయ్య బొజ్జ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: