గుండాల ఏప్రిల్ 9(మన్యం మనుగడ) జార్జి రెడ్డి స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు పృథ్వి అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జార్జిరెడ్డి కోట్లాది హృదయాల లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజీలో ఈనెల 13వ తారీఖున లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ సభకు పెద్ద మొత్తంలో విద్యార్థులు యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీ వై ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్, భానోత్ నరేందర్, వంశి వర్ధన్, ధరావత్ దేవా, కోడూరి జగన్, ఫోన్ ఎం కృష్ణ , సుదర్శన్, నరేష్ , పాపయ్య, ప్రజా పంధా నాయకులు ఈ సం శంకర్, కోరం శాంతయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: